‌‘అప్పటి వరకు ఆర్జిదారులను ఇబ్బందులకు గురి చేయవద్దు’

by  |
‌‘అప్పటి వరకు ఆర్జిదారులను ఇబ్బందులకు గురి చేయవద్దు’
X

దిశ,వెబ్ డెస్క్: ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. బీఆర్ఎస్‌పై కోమటిరెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ పై యథావిధిగా హైకోర్టు స్టే కొనసాగించింది. సుప్రీం ఉత్తర్వులు వచ్చే వరకు ఎల్ఆర్ఎస్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తెలిపింది. సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందని హై కోర్టు చెప్పింది. ఆర్జీదారులను అప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని అడ్వకేట్ జనరల్ తెలిపారు.

Next Story

Most Viewed