భావోద్వేగానికి లోనైన హైకోర్టు చీఫ్ జస్టిస్

by  |
భావోద్వేగానికి లోనైన హైకోర్టు చీఫ్ జస్టిస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నందుకు చాలాబాధగా ఉందని జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు.. వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలని , సహచర జడ్జిలు, సిబ్బంది అభిమానాన్ని మరచిపోలేనని వ్యాఖ్యానించారు. ఒక్కోసారి రాత్రి 10గంటల వరకు పనిచేయాల్సి వచ్చిందన్నారు. చీఫ్ జస్టిస్‌కు వీడ్కోలు పలకడానికి రోడ్డుకు ఇరువైపులా మహిళా రైతులు జాతీయ జెండాలు పట్టుకొని నిల్చున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed