స్వర్ణ ప్యాలస్ నిందితులకు కోర్టులో నిరాశ  

by  |
స్వర్ణ ప్యాలస్ నిందితులకు కోర్టులో నిరాశ  
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ స్వర్ణ ప్యాలస్ అగ్నిప్రమాద ఘటనలో నిందితుల బెయిల్ పిటిషన్ ను హై కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయగా మరి కొందరిని విచారణ చేసినట్లు తెలిపారు. కాగా నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 21 కి వాయిదా వేసింది.

ముగ్గురు నిందితులని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ ను సైతం బెయిల్ పిటిషన్ తో పాటు విచారిస్తామంటూ వాయిదా వేశారు న్యాయమూర్తి. ఇక హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన మూడో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ న్యాయస్థానం తదుపరి విచారణ 21 కి వాయిదా వేసింది.

Next Story

Most Viewed