ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత

by  |
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు సింఘూ టిక్రీ, ఘాజీపూర్ మీదుగా రైతులు ఢిల్లీకి చేరుకుంటున్నారు. జాతీయ పతకాలతో రైతులు నినాదాలు చేశారు. ర్యాలీగా వెళ్తున్న రైతులను సరిహద్దుల్లో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఢిల్లీలోని ఘాజీపూర్ సరిహద్దులో, సంజయ్ గాంధీ ట్రాన్స్‌పోర్టు నగర్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రోడ్డుకు అడ్డుగా పెట్టిన కంటైనర్‌ను రైతులు ట్రాక్టర్లతో నెట్టివేశారు. బారికేడ్లను తోసుకుంటూ రైతులు ముందుకు వెళ్తున్నారు. దీంతో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. పలు చోట్ల రైతులపై లాఠీచార్జ్ చేశారు. రైతుల ర్యాలీలో దాడులు జరగొచ్చని నిఘావర్గాల హెచ్చరికతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.


Next Story

Most Viewed