ఎప్పటికైనా నేను వారి కోడల్నే అవుతాను- రష్మిక

by  |
ఎప్పటికైనా నేను వారి కోడల్నే అవుతాను- రష్మిక
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘గీతా గోవిందం’ చిత్రంతో తెలుగువారందరికీ చేరువైపోయింది రష్మిక మందన్నా. తన చిలిపి చేష్టలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి నేషనల్ క్రష్ గా సెటిలైపోయింది. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అని బేధం లేకుండా అన్నింటిలోనూ రంగప్రవేశం చేసి తన సత్తా చాటుకుంటుంది. ఇక తాజాగా కోలీవుడ్ లో కార్తీ సుల్తాన్ చిత్రంతో అమ్మడు అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పల్లెటూరి యువతిలా రష్మిక నటన అటు తమిళ వారికీ, ఇటు తెలుగు వారికి కూడా నచ్చేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సినిమా విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అమ్మడు షేర్ చేసుకుంది.

‘సుల్తాన్’ సినిమా చేటప్పుడు తమిళ్ వారు తనను బాగా చూసుకున్నారని, తమిళనాడు అంటే తనకు ఎంతో ఇష్టమని, అక్కడ ప్రజలు, సంప్రదాయం తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పింది. అంతేకాకుండా తమిళ వంటకాలంటే చాలా ఇష్టమని.. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనే కోరిక ఉందని తెలిపింది. రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్థం రద్దు చేసుకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్మిక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమాల్లో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ లో ‘డెడ్లీ’, ‘మిషన్ మజ్ను’ వంటి వరుస సినిమాలలో నటిస్తుంది.



Next Story

Most Viewed