గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగమైన దిగాంగానా

by  |
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగమైన దిగాంగానా
X

గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమానికి సెలెబ్రిటీల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే బుల్లితెర నటుల నుంచి వెండితెర సినీ తారల వరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. రేణుదేశాయ్, సమంత, రశ్మిక మందన్నా, ఉదయభాను, అక్కినేని నాగార్జున, శర్వానంద్, సానియామీర్జా వంటి ఎంతోమంది ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ దిగాంగనా సూర్యవంశీ.. ముంబైలోని తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించింది.

టీవీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన దిగాంగనా సూర్యవంశీ.. వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే హిందీ, తమిళ, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘సీటిమార్’ సినిమాలో టీవీ రిపోర్టర్‌గా నటిస్తోంది. సంపత్‌ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సంపత్ నంది విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన ఈ నటి.. తన ఇంట్లో మొక్కలు నాటింది. ఇది చాలా మంచి కార్యక్రమం అని, ఇందులోకి తనను ఆహ్వానించిన దర్శకుడు సంపత్ నందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని పేర్కొంది. ఈ సందర్భంగా తాను నాటిన మొక్కలను సోషల్ మీడియాలో పంచుకుంది దిగంగనా.



Next Story

Most Viewed