శింబు సోషల్ మీడియా ఎంట్రీకి ముహూర్తం!

by  |
శింబు సోషల్ మీడియా ఎంట్రీకి ముహూర్తం!
X

దిశ, వెబ్‌డెస్క్ :
తమిళ స్టార్ హీరో శింబుకు భారీ ఫాలోయింగ్ ఉంది. తన మాస్ అప్పియరెన్స్, డ్యాన్సింగ్ స్టైల్‌కు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారందరితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియాలో ఎంటర్ కాబోతున్నారు శింబు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేయగా.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం యాక్టర్స్ అందరూ సోషల్ మీడియా వేదికగానే తమ సినిమాలు, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుండగా.. తను కూడా అదే బెస్ట్ అనుకుని ఈ నిర్ణయం తీసుకున్నాడు. అక్టోబర్ 22 ఉ: 9.09 నిమిషాలకు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లోనూ అకౌంట్ ఓపెన్ చేయబోతున్నాడు శింబు.

కాగా హీరోయిన్ త్రిష, శింబుల పెళ్లి వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి అంటూ కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుండగా.. దీనిపై శింబు తండ్రి స్పందించకపోవడం ఈ రూమర్స్‌కు మరింత బలాన్నిచ్చింది.


Next Story

Most Viewed