సిగ్గుండాలి రా.. వెళ్లి పడుకో.. బీజేపీ నేతకు హీరో సిద్దార్థ్ స్ట్రాంగ్ కౌంటర్

by  |
సిగ్గుండాలి రా.. వెళ్లి పడుకో.. బీజేపీ నేతకు హీరో సిద్దార్థ్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో సిద్దార్థ్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికి తెలిసిందే. గతంలో కొంతమంది పొలిటీషియన్స్ పైన సిద్ధార్థ్ తనదైన శైలిలో కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం సిద్దార్థ్ బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గతకొన్ని రోజుల నుంచి సిద్దు, బీజేపీ నాయకుల మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తుంది. ఇందులో భాగంగానే సిద్దార్థ్, ఇటీవల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ సందేశాలు వచ్చాయని, అంతేగాక అత్యాచారం బెదిరిపులు కూడా వచ్చాయని కానీ వారు ఏం చేసినా తానూ తగ్గేది లేదంటూ తేల్చి చెప్పాడు.

https://twitter.com/Actor_Siddharth/status/1390401205860401156

ఇక సిద్దార్థ్ ట్వీట్లపై స్పందించిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అతనిపై ఘాటు విమర్శలు చేశారు. సిద్దార్థ్ సినిమాలకు మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడా? సమాధానం చెప్పండి..? అంటూ ట్వీట్ చేశారు. ఇక ట్వీట్ చూసిన సిద్దు అంతకంటే ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ” లేదు రా ..దావూద్ నా టిడిఎస్ చెల్లించడానికి సిద్ధంగా లేడు. నేను పరిపూర్ణ పౌరుడిని, పన్ను చెల్లింపుదారుని రా విష్ణు. వెళ్ళి పడుకో. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అంటా. సిగ్గుండాలి” అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.



Next Story