- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు కాక పట్టిస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కించపరుస్తూ నిండు అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఆ వ్యాఖ్యలపై చెలరేగిన మంట ఇంకా చల్లారడం లేదు. నాని వ్యాఖ్యలకు నిరసనగా తాను మళ్లీ సీఎం అయ్యేంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టబోనని బాబు ప్రకటించగా.. నాని క్షమాపణలు చెప్పాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన తెలుగు తమ్ముళ్లను పోలీసులు అరెస్ట్ చేయడం హీట్ను మరింత పెంచింది.
ఈ క్రమంలో నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దిగి వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం హాట్టాపిక్గా మారింది. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్తో పాటు నందమూరి కుటుంబ సభ్యులందరూ ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. ఇంకోసారి కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. నందమూరి కుటుంబ సభ్యులతో కలిసి బాలయ్య ప్రెస్ మీట్ పెట్టగా.. జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఒక వీడియో విడుదల చేశాడు.
తాజాగా అసెంబ్లీలో జరిగిన ఘటనపై హీరో నారా రోహిత్ స్పందించాడు. కొడాని నాని వ్యాఖ్యలకు నిరసన తెలిపాడు. నారావారిపల్లెలోని తమ పూర్వీకుల సమాధుల వద్ద కూర్చోని నిరసన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మరోమారు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదంటూ వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చాడు. రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననం దారుణమన్నాడు. క్రమశిక్షణకు మారుపేరు నందమూరి కుటుంబమన్నాడు.