- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తనకు ఒక పనికాదు.. ఎన్నో పనులు ఉంటాయి. తాను చేస్తున్నది ప్రజాసేవని చెప్పుకొచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా రోగులకు సేవలు అందిస్తున్నానని… అలాగే సినిమాల ద్వారా ప్రజలకు వినోదం అందిస్తున్నానంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. తనకు సంస్కారం ఉందని అందువల్లే విమర్శలు చేసే ముందు కూడా ఆలోచిస్తానన్నారు. ఇతరులు తనపై నోరు పారేసుకుంటే సహించేది లేదని బాలకృష్ణ హెచ్చరించారు.
Next Story