సరికొత్త 'గ్లామర్ ఎక్స్‌టెక్' బైకును విడుదల చేసిన హీరో మోటోకార్ప్

by  |
సరికొత్త గ్లామర్ ఎక్స్‌టెక్ బైకును విడుదల చేసిన హీరో మోటోకార్ప్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన సరికొత్త ‘గ్లామర్ ఎక్స్‌టెక్’ బైకును మంగళవారం లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ డ్రమ్ వేరియంట్, డిస్క్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్‌లో వీటి ఎక్స్‌షోరూమ్ ధరలు డ్రమ్ వేరియంట్ రూ. 78,900, డిస్క్ వేరియంట్ రూ. 83,700గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. 125సీసీ బీఎస్6 ఇంజిన్‌తో ఎక్స్‌సెన్స్ ప్రోగ్రామ్‌డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ కలిగిన ఈ బైక్ 7 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.

బ్లూటూట్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బీ ఛార్జర్ లాంటి అధునాతన ఫీచర్లను అందిస్తున్నట్టు హీరో మోటోకార్ప్ వివరించింది. అంతేకాకుండా ఆటో సెయిల్ టెక్నాలజీ ద్వారా హీరో మోటో కార్ప్ విప్లవాత్మక ఇ3ఎస్(ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్) సౌకర్యాలను అందిస్తున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. ‘కొత్త గ్లామర్ బైక్ కొత్త తరం వాహనదారులకు తగినట్టుగా రూపొందించాం. ముఖ్యంగా యుతను ఆకర్షించే కొత్త టెక్నాలజీ వినియోగం, స్టైలింగ్ ఇందులో ఉంది. నూతన టెక్నాలజీ, భద్రత కలిగిన ఈ కొత్త గ్లామర్ ఎక్స్‌టెక్ వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలతో అందుబాటు ధరలో అందిస్తున్నట్టు’ హీరో మోటోకార్ప్ స్ట్రాటజీ అండ్ గ్లోబల్ ప్రోడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లె మసన్ చెప్పారు.

Next Story