‘మా’లో కలకలం రేపుతున్న హేమ వాయిస్ మెసేజ్.. నరేష్ బాగోతం మొత్తం..

by  |
maa elections
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలో జరుగబోతున్న విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పీఠం కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, నరసింహారావులు పోటీ పడుతున్నారు. కానీ.. మంచు విష్ణు-ప్రకాష్‌రాజ్ మధ్యే హోరాహోరి పోటీ ఉండనుంది. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల గురించి హేమ ‘మా’ లో ఉన్న సభ్యులకు పంపిన వాయిస్ మెసేజ్ ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో కలకలం రేపుతోంది. ఈ వాయిస్ మెసేజ్‌లో నరేష్ పై సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం.

ఈ వాయిస్ మెసేజ్‌లో.. ‘మా’ ఎన్నికలు జరుగుకుండా నరేష్ చూస్తున్నారని, ఆయనే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని చూస్తున్నారన్నారు. అంతేకాకుండా ఇంతవరకు ‘మా’ అసోసియేషన్ ఒకరూపాయి కూడా సంపాదించలేదని, నరేష్ మాత్రం ‘మా’ అసోసియేషన్ అకౌంట్లో ఉన్న రూ.5 కోట్లకు రూ.3 కోట్లు ఖర్చు చేశారన్నారు. గతేడాది మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రూ.2.5 కోట్లు ఖర్చు అవగా, ఆఫీసు ఖర్చులు, ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే రూ. 3 కోట్ల మేర ఖర్చు జరగిందన్నారు హేమ. నరేష్ కుర్చీ దిగకుండా.. అకౌంట్లలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారని, ఎలక్షన్స్ జరుగకుండా పథకం పన్నుతున్నారని, ఇలాగే జరిగితే రానున్న సంవత్సరంలోపు ‘మా’ అకౌంట్లో చిల్లిగవ్వకూడా ఉండకుండా ఖాళీ చేస్తారని విమర్శలు చేశారు.

కాబట్టి మనందరం ఎలక్షన్స్ జరిగేలా చూడాలని కోరుతూ లెటర్ పెడుదామని, అందుకోసం 200 నుండి 250 మందికి లెటర్ పంపిస్తున్నానన్నారు. ఆ లెటర్‌లో ఇప్పటివరకు నేను చెప్పిన విషయమే ఉంటుందని తెలిపింది. మీరు ఎక్కడ ఉంటే అక్కడికి మనిషిని పంపిస్తానని మీ ఇష్టమైతే లెటర్‌లో సంతకం పెట్టండి అని వెల్లడించింది. ఈ విషయాలను తెలుపుతూ హేమ పంపిని వాయిస్ మేసెజ్ ప్రస్తుతం ‘మా’లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story

Most Viewed