'ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'

by  |
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
X

దిశ, నల్లగొండ: ఇంటి యాజమాని మృతి చెంది ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. మిత్రులు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మేడిపల్లి సైదులు అనే వ్యక్తి అకాల మరణం పొందారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి మేమున్నామని స్నేహితులందరూ కలిసి భరోసా కల్పించారు. వారి ఆర్థిక పరిస్థితిని చూసి చలించిపోయిన స్నేహితులు గ్రామస్తుల సహాయంతో లక్షా 80వేల రూపాయలు సేకరించారు. రూ. లక్షా 50 వేలతో 121 గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి కుటుంబానికి అందించారు. సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆ కుటుంబం పేర్కొన్నది.


Next Story

Most Viewed