- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన 48 గంటల్లో కొడగు జిల్లాలోని బాగమందాలలో 105 సెం.మీ.ల కుంభపోత వర్షం కురిసినట్టు కేంద్ర జల సంఘం తెలిపింది. ఈ వానధాటికి వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా కావేరి, బీమా, హేమావతి నదులు ప్రవాహ ధాటి పెంచాయి. కలబుర్గి ప్రాంతంలో బీమా నదిలో నీటిమట్టం బాగా పెరిగింది. వర్షాలకు బెళగావి జిల్లాలో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బాగముందాలలో బాగందేశ్వర ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. చిక్ మగళూరు జిల్లాలోని కొప్పా పట్టణంలో అలగేశ్వర రోడ్డుపై కొండ చరియలు విరిగిపడి ట్రాఫిక్ నిలిచిపోయింది.
కొడగు జిల్లా బ్రహ్మగిరి కొండల్లో కొండ చరియలు విరిగిపడి పూజారితో సహా ఐదుగురు గల్లంతయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో 9 జిల్లాలపై వరద ప్రభావం ఉన్నట్టు ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అశోక్ తెలిపారు. 375 ఇళ్ళు స్వల్పంగా, 12 ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. కాగా కోవిడ్ చికిత్స పొందుతున్న కర్ణాటక సీఎం యడ్యూరప్ప వరద పరిస్థితులపై సమీక్షించి అత్యవసర సహాయం కింద 50 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత కుటుంబాలకు 10 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని అధికారులకు సూచించారు.