హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం

by  |
Patangi toll plaza,
X

దిశ, చౌటుప్పల్: దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శుక్రవారం దసరా పండుగ అనంతరం శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అందరూ ఇంటివద్దే ఎంజాయ్ చేశారు. సోమవారం తిరిగి పనివేళలు ప్రారంభించనున్నారు. దీంతో ఉద్యోగులు తమ తమ కుటుంబ సభ్యులతో ఆదివారం సాయంత్రమే హైదరాబాద్ బాటపట్టారు. ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని GMR సిబ్బంది హైదరాబాద్ వైపు వెళ్లే వాహన లైన్ల సంఖ్య పెంచినా.. ఏ మాత్రం రద్దీ తగ్గలేదు. దీంతో వాహనదారులు సుమారు గంట పాటు టోల్ ప్లాజా వద్ద వేచి ఉండాల్సి వచ్చింది.

Next Story

Most Viewed