కారులో భారీగా బంగారం పట్టివేత

by Vadlamudi Anukaran |   (  Updated:2021-03-24 06:14:52  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: యాద్రాద్రి భువనగిరి పతంగి టోల్ గేట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 26 కిలోల బంగారు బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని అంచనా. కోల్ కత్తా నుండి కారులో హైదరాబాద్ కి తరలిస్తున్న ముగ్గురు స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి [&hellip;]</p>

కారులో భారీగా బంగారం పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: యాద్రాద్రి భువనగిరి పతంగి టోల్ గేట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. బుధవారం చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 26 కిలోల బంగారు బిస్కెట్లను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని అంచనా. కోల్ కత్తా నుండి కారులో హైదరాబాద్ కి తరలిస్తున్న ముగ్గురు స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్దకు బంగారం ఎలా వచ్చింది? హైదరాబాద్ లో బంగారం ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారు? ఈ గోల్డ్ మాఫియా వెనుక ఎవరు ఉన్నారు అనే కోణం లో విచారిస్తున్నారు.

Next Story