మొగుళ్లపల్లిలో వర్ష బీభత్సం.. నేలమట్టమైన ఇండ్లు

by  |
Mugullapalli village
X

దిశ, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. మండలంలోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. అంతేగాకుండా.. మండల వ్యాప్తంగా పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. భారీగా వరదనీరు చేరి చెరువుల కట్టలు తెగి, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి వరదనీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎస్ఐ మహేందర్ కుమార్ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా తక్షణ చర్యలు చేపట్టారు.

Next Story