ఆ ముగ్గురు 900కేజీలు..

by  |
ఆ ముగ్గురు 900కేజీలు..
X

దిశ, విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న 900 కేజీల గంజాయిని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. ఎస్‌ఈబి అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు బుచ్చయ్యపేట మండలం వడ్డాది జంక్షన్ సమీపంలో పాడేరు ఏజన్సీ నుండి ఒడిషా రాష్ట్రానికి లారీలో గంజాయి తరలిస్తుండుగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో లారీతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని విశాఖ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సై సూర్య చంద్రమౌళి తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.18 లక్షలు ఉంటుందన్నారు.

Next Story