మన్యంలో భారీగా పోలీసుల మోహరింపు

by  |
మన్యంలో భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఏవోబీలో పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు జరగనున్నట్లు తెలిసింది. అదేవిధంగా మావోయిస్టు అగ్రనేతలు విశాఖ మన్యంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా, గత తొమ్మిది రోజుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. రాళ్లగడ్డ వద్ద జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్లు తెలిసింది.

Next Story

Most Viewed