బాత్రూమ్‌లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువ?

by Sujitha Rachapalli |

చాలా మంది స్నానం చేసే సమయంలో ముందుగా తలపై నీరు పోసుకుంటారు.కానీ ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది తాజా అధ్యయనం. జర్నల్ ఆఫ్ మెడికల్ అసోషియేషన్ ఆఫ్ కెనడా చేసిన స్టడీలో ఈ విషయాన్ని గుర్తించింది

బాత్రూమ్‌లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఎందుకు ఎక్కువ?
X

దిశ, వెబ్ డెస్క్ : చాలా మంది స్నానం చేసే సమయంలో ముందుగా తలపై నీరు పోసుకుంటారు.కానీ ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించింది తాజా అధ్యయనం. జర్నల్ ఆఫ్ మెడికల్ అసోషియేషన్ ఆఫ్ కెనడా చేసిన స్టడీలో ఈ విషయాన్ని గుర్తించింది. తలపై నీరు పోస్తే శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా మారిపోతుందని.. రక్తప్రసరణ వేగంగా తలవైపు పెరుగుతుంది. ఆర్జరీలు పగిలే ప్రమాదం ఉందని తెలిపింది. దీని వల్ల స్ట్రోక్, మినీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి రక్తపోటు, కొలెస్ట్రాల్, మైగ్రేన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

స్నానం చేసేటప్పుడు వాటర్ ముందుగా తలపై పోయకుండా.. మొదట పాదాలపై నీరు పోయాలని.. ఆ తర్వాత మెల్లగా శరీరంపై నీరు పోయాలని సూచించింది. చివరలో మాత్రమే తలకు నీరు పోయాలని చెప్పింది. ఇలా చేయడం వల్ల శరీరానికి ఉష్ణోగ్రత మార్పును శరీరం సహజంగా అంగీకరిస్తుంది.

Next Story