రోజూ ఎక్కువగా నీరు తాగడం కూడా ప్రమాదమేనా?

by Dishanational2 |
రోజూ ఎక్కువగా నీరు తాగడం కూడా ప్రమాదమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.అందువలన డాక్టర్లు రోజూ ఎక్కువ మొతాదులో నీరు తాగాలి అని చెబుతారు. అలా అని మరీ ఎక్కువగా నీరు తాగితే కూడా ఆరోగ్యానికి మంచిది కాదంట. న్యూ ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమరేంద్ర పాఠక్ మాట్లాడుతూ.. మన మెదడులో సెన్సార్ ఉందని, దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు దాహం వేస్తుందని అన్నారు. ప్రజలు దాహం వేసినప్పుడు నీరు తాగాలని, కానీ బలవతంగా నీరు తాగకూడదంటున్నారు. ఒక వేళ బలవంతంగా నీరు తాగితే, మన రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీనిని హైపోనాట్రేమియా అంటారు. రక్తంలో అధిక సోడియం లోపం ఉంటే, అప్పుడు బలహీనత, ఇంద్రియ భంగం, మెదడు వాపు సంభవించవచ్చు. దీని వల్ల చాలా సార్లు ప్రజలు మరణిస్తున్నారంట. అందువలన రోజుకు ఒక వ్యక్తి 3 లీటర్ల వరకు మాత్రమే నీరు తాగవచ్చునంట.

Also Read: దాదాపు ప్రతి 40 సెకన్లకు ఒక కేసు నమోదు: బ్రెయిన్ స్ట్రోక్


Next Story

Most Viewed