కరోనా జిల్లాలకు ప్రజారోగ్య బృందాలు..

by Shyam |

<p>దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ కట్టడి కోసం కేంద్రం ప్రజారోగ్య బృందాలను పంపనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌కు ఇద్దరు సభ్యుల బృందం రానుంది. ఈ బృందం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి కరోనా నియంత్రణ కోసం పనిచేస్తూ.. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు రిపోర్టులు అందజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన సలహాలు, సూచనలు అందజేయనుంది. కాగా, తెలంగాణకు రానున్న [&hellip;]</p>

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ కట్టడి కోసం కేంద్రం ప్రజారోగ్య బృందాలను పంపనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌కు ఇద్దరు సభ్యుల బృందం రానుంది. ఈ బృందం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి కరోనా నియంత్రణ కోసం పనిచేస్తూ.. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు రిపోర్టులు అందజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన సలహాలు, సూచనలు అందజేయనుంది. కాగా, తెలంగాణకు రానున్న బృందంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో పనిచేస్తోన్న డాక్టర్ జయంత్ దాస్, డాక్టర్ దీపయాన్ బెనర్జీ ఉన్నారు.

Tags: Health team, Central, Hyderabad, corona control, state health dept

Next Story