ఆ పనికి సిగ్గు పడితే ఇక అంతే..!

by  |
urination
X

దిశ, డైనమిక్ బ్యూరో : మానవ శరీరం ఎంత నీరు తాగుతే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంటే.. తాగడమే కాదు.. వచ్చినప్పుడు పోస్తేనే మూత్ర విసర్జన సక్రమంగా సాగుతుంది. కానీ, చాలా మంది ఉక్కపట్టుకొని ఉంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. బయటకు వచ్చిన సమయాల్లో టాయిలెట్స్ లేక ఇలాంటి పరిస్థితి వస్తుంటే.. ప్రయాణాల్లో ఎవరో ఏమో అనుకుంటారనే చాలా మంది బస్సు ఆపరు. కొద్ది సేపు ఓర్చుకుందాం అనుకుంటూ ఇబ్బంది పడుతుంటారు.

కానీ, మూత్ర విసర్జన సక్రమంగా సాగకపోతే లేనిపోని రోగాలను కొని తెచ్చుకోవడమేనని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయం సాగి పెద్దగా అవుతుందని, దీంతో దీని సామర్థ్యం తగ్గుతూ వస్తుందని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇలా చేస్తే కిడ్నీలు ఫెయిల్ అయ్యే చాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ఎప్పుడొస్తే అప్పుడు పోసుకోవడం మేలు.


Next Story

Most Viewed