రేపు ఖమ్మంలో ఈటల పర్యటన

by  |
రేపు ఖమ్మంలో ఈటల పర్యటన
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి శుక్ర‌వారం ఖ‌మ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 టూ నాట్ పరీక్షల నిర్ధారణ కేంద్రాన్ని ప్రారంభిస్తారని, అదేవిధంగా ఉదయం 11 గంటలకు మమత హాస్పిటల్‌లో ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్, కోవిడ్-19 వార్డును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి ఈటల ప్రారంభిస్తారని, అనంతరం 11 గంటల 30 నిమిషాలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి అజయ్ కుమార్‌తో కలిసి వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు.



Next Story