ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం విషమం

by  |
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం విషమం
X

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం విషమించింది. కరోనాతో ఇటీవల రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరిన ఆయనకు న్యుమోనియాకు గురయ్యారు. దీంతో అతన్నినగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవల తీవ్రమైన జ్వరం రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. మంగళవారం చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. బుధవారం మరోసారి చేసిన పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన సాకేత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, జైన్ త్వరగా కోలుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆకాంక్షించారు.

Next Story

Most Viewed