ఏపీలో కొత్తగా 5,120 కరోనా కేసులు..

by  |
ఏపీలో కొత్తగా 5,120 కరోనా కేసులు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 5,120 కరోనా కేసులు నమోదు కాగా.. 34 మంది వైరస్‌తో పోరాడి ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులు కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,34,427కు చేరింది. ఇందులో 49,513 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా వైరస్‌కు చికిత్స పొంది 6,78,828 కోలుకున్నారు. కాగా, ఇప్పటివరకు ఏపీలో 6,086 కరోనా మరణాలు సంభవించాయి.



Next Story

Most Viewed