ప్రియురాలితో హెడ్ కానిస్టేబుల్ రాసలీలలు.. ఆ స్థితిలో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కి..

by  |
ప్రియురాలితో హెడ్ కానిస్టేబుల్ రాసలీలలు.. ఆ స్థితిలో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కి..
X

దిశ, వెబ్‌డెస్క్: అతడో పోలీస్ కానిస్టేబుల్.. ప్రజలు తప్పుచేస్తే దండించాల్సింది పోయి అతడే దారి తప్పాడు. వేరే మహిళ మోజులో పడి భార్యాబిడ్డలను మరిచాడు. ఇంటికి కూడా వెళ్లకుండా ప్రియురాలి ఇంట్లోనే మకాం వేశాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న భార్య అపరాకాళిలా మారింది. భర్త, ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న ప్లేస్ కి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా అతడి బాగోతం బయటపెట్టింది. కాలర్ పట్టుకు లాకొచ్చి నడిరోడ్డుపై తాట తీసింది. ఈ ఘటన పాల్వంచలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే.. కొత్తగూడెం 6వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్‌ గడ్డం రాజేష్‌ పాల్వంచ బొల్లేరుగూడెంలో నివాసం ఉంటున్నాడు. 2011 సంవత్సరంలో అతడు మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన స్వప్నను ప్రేమించి.. పెళ్లి కూడా చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. పెళ్లైన కొద్దిరోజులు సాఫీగా సాగిన వీరి కాపురంలో గొడవలు తలెత్తాయి. రాజేష్‌ ప్రతిరోజు స్వప్నను తిట్టడం, ఇష్టానుసారంగా కొట్టడం లాంటివి చేయడం ప్రారంభించాడు. ఇలా రెండు సంవత్సరాల నుంచి వీరి గొడవలు సాగుతూ కోర్టు వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే రాజేష్ కు వేరొక అమ్మాయితో సంబంధం ఉందని తెలుసుకున్న భార్య స్వప్న గురువారం మహిళా సంఘం నాయకులతో కలిసి బొల్లేరుగూడెంలోని భర్త, ప్రియురాలు ఉంటున్న ఇంటికి చేరుకొంది. ఆ సమయంలో వారిద్దరూ కలిసి ఉండడాన్ని చూసి.. భర్తను నడిరోడ్డు మీదకు లాగి దేహశుద్ది చేసింది. అతడితో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని చితకబాదింది.

అనంతరం స్వప్న మాట్లాడుతూ “పెళ్లైన దగ్గరనుంచి నరకయాతన అనుభవించాను , ఎప్పుడు నన్ను కొడుతూ ఉండేవాడు. గతంలో నన్ను చిత్రహింసలు పెడుతుండడంతో అధికారులు అతనిని సస్పెండ్‌ చేశారు. అయినా అతనిలో మార్పు రాలేదు. అతడికి చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని” తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed