పాన్ డబ్బాలో చోరీ చేశాడని కొట్టి చంపారు…

by  |
Murder
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో సోమవారం పట్టపగలు ఓ గుర్తు తెలియని వ్యక్తి హత్య వెలుగు చూసింది. నగరంలోని ప్రూట్ మార్కెట్ సమీపంలోని ఓపెన్ ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన సంఘటన గురించి పోలీసులకు ఉప్పందింది. నగరంలోని ఒకటవ టౌన్ ఎస్‌హెచ్ఓ అంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కొట్టి చంపినట్లు తెలిసింది. స్థానిక ఫ్రూట్ మార్కెట్ వద్ధ ఉన్న సిసి కెమెరాల ద్వారా కేసును పోలీసులు చేధించడంలో సఫలం అయ్యారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. అదివారం రాత్రి కొందరు యువకులు ఒక వ్యక్తిని బలవంతంగా కారులో ఫ్రూట్ మార్కెట్ లోని నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకువచ్చి విపరీతంగా కొట్టారు.

అతడు ఎవ్వరు అనేది తెలియదని పోలీసులు చెబుతున్నారు. సిసి కెమెరాలు, ప్రాథమిక సమాచారం అధారంగా స్థానికంగా నాలుగైదు పాన్ డబ్బాలకు యజమాని కొడుకు తమ పాన్ డబ్బాలలో చోరి జరిగిందని సెల్‌ఫోన్ ఇతర సామాగ్రి దొంగతనం చేశాడని గుర్తు తెలియని వ్యక్తిని నిర్బంధించి చితకబాదడంతో చనిపోయినట్లు గుర్తించారు. స్థానికంగా ఉన్న ఒక సామీల్ వారికి చనిపోయిన వ్యక్తి తనను ఫలానా వ్యక్తులు కొట్టారని తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చెయ్యాలని చెప్పినట్లు తెలిసింది. పోలీసులు ఆకోణంలో విచారణ చేస్తున్నారు. సంఘటన స్థలంను ఏసీపి వేంకటేశ్వర్లు సందర్శించి వివరాలను సేకరించారు.



Next Story

Most Viewed