విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించేది ఆయనే..!

by  |
విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించేది ఆయనే..!
X

దిశ వెబ్‎డెస్క్:

మత విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించేది చంద్రబాబు నాయుడని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం తాడేపల్లిలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. హిందూత్వం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని.. విజయవాడో 39 పురాతన ఆలయాలను కులదోయించిన ఘనత ఆయనదేనని అన్నారు. సీబీఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదన్న చంద్రబాబుకు ఇప్పుడు సీబీఐ మీద నమ్మకం ఎలా కలిగిందో చెప్పాలన్నారు.

అంతర్వేది ఆలయ రథం దగ్ధం కావడం దురదృష్టకరమని.. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి ఈవోను వెంటనే తొలగించిందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ ఘటనతో ప్రభుత్వం బురద జల్లేందుకు కొందరు యత్నిస్తున్నారని.. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. భక్తుల ముసుగులో కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అంబటి అన్నారు.



Next Story