- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరి కోతలు బంద్ చేయాలి.. లేకపోతే కేసులు పెడుతాం: ఎస్సైలు
<p>దిశ, నేరేడుచర్ల: నేరేడుచర్ల గరిడేపల్లి పాలకవీడు మండలంలో రేపు వరి కోతలు బంద్ చేయాలని ఎస్సైలు విజయ్ ప్రకాష్, కొండల్ రెడ్డి, సైదులు శనివారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నందున మిర్యాలగూడలోని రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు, లారీలు భారీగా చేరుకున్నాయని, దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిల్చిపోవడంతోపాటు అక్కడికి వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వరి కోత మిషన్ యజమానులు వరి కోతలను […]</p>

X
దిశ, నేరేడుచర్ల: నేరేడుచర్ల గరిడేపల్లి పాలకవీడు మండలంలో రేపు వరి కోతలు బంద్ చేయాలని ఎస్సైలు విజయ్ ప్రకాష్, కొండల్ రెడ్డి, సైదులు శనివారం విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నందున మిర్యాలగూడలోని రైస్ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు, లారీలు భారీగా చేరుకున్నాయని, దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిల్చిపోవడంతోపాటు అక్కడికి వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో వరి కోత మిషన్ యజమానులు వరి కోతలను నిలిపివేయాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. 31 మధ్యాహ్నం నుంచి ధాన్యం ట్రాక్టర్ల రవాణాకు ఎటువంటి అనుమతి లేదని, వచ్చిన ధాన్యం ట్రాక్టర్లును చిల్లేపల్లి వద్ద నిలిపివేస్తామన్నారు. ఈ నిబంధనలకు రైతులు సహకరించాలని కోరారు.
Next Story






