మళ్లీ గ్రౌండ్‌లోకి హార్థిక్ పాండ్యా

by  |
మళ్లీ గ్రౌండ్‌లోకి హార్థిక్ పాండ్యా
X

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా వెన్నెముక గాయానికి చికిత్స చేసుకొని గత కొన్ని వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకున్న పాండ్యా.. తాజాగా మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. డీవై పాటిల్ 16వ టీ20 కప్‌లో రిలయన్స్ జట్టు తరపున బరిలోకి దిగాడు. బరోడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లో 38 పరుగులు చేసి సత్తా చాటాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
తాను ఎక్కడకు సంబంధించిన వాడినో అక్కడే ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా..మీ అండదండలు నాకు కావాలి అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.

Next Story

Most Viewed