- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని కొత్తూరులో ఏసీపీ ఫణింధర్, సీఐ సతీష్ బాబులు హరితహారంలో భాగంగా మంగళవారం మొక్కలు నాటారు. పక్కనే పత్తిపంట చెనులో మహిళా కూలీలు కలుపు తీస్తున్నారు. దీంతో మొక్కలు నాటిన అనంతరం ఏసీపీ వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. పత్తిలో పురుగు బాగా ఉంది అని, పంటకు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారా? అంటూ వారితో మాట కలిపి వారితో పాటు ఏసీపీ కూడా కలుపు తీశారు. మీకెందుకు సార్ ఈ కష్టం.. అని కూలీలు అనగా.. నేనూ కూలీనే అమ్మ. కాకుంటే ప్రభుత్వం నుండి జీతం తీసుకునే నెలవారీ కూలీని అంటూ ఆప్యాయంగా వారితో కలిసిపోయారు. దానితో మహిళలు ఏసీపీ తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Next Story