వీళ్లను హరీశ్‌రావు అభినందించారు

by  |
వీళ్లను హరీశ్‌రావు అభినందించారు
X

దిశ, సిద్దిపేట: సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టణంలో కోర్టు జంక్షన్ లో బుధవారం ఉదయం రూ. 4లక్షల వ్యయంతో సుడా ఆధ్వర్యంలో సుందరీకరణ- మినీ క్లాక్ టవర్ పార్కును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, సుడా వైస్ ఛైర్మన్ రమణాచారి, మున్సిపల్ కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, సుడా డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులు మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పాలక మండలి సభ్యులను మంత్రి అభినందించారు.

Next Story

Most Viewed