వాహనదారులకు మంత్రి హరీశ్‌రావు ఊరట

by  |
వాహనదారులకు మంత్రి హరీశ్‌రావు ఊరట
X

దిశ, మెదక్: లాక్ డౌన్ అమలవుతుండటంతో రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో శామీర్ పెట్ వద్ద ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని గమనించారు. దీంతో వెంటనే కారు ఆపి, ఎందుకు ఆగారు, ఎక్కడకు వెళ్తున్నారంటూ ఆరా తీశారు. ఫలానా చోటుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. దీంతో మంత్రి పోలీసులతో మాట్లాడి వారిని వెళ్లనివ్వాలని ఆదేశించారు.

Tags: harish rao, siddipet, hyderabad, lackdown, shameerpet,

Next Story

Most Viewed