ఈటల గెలిస్తే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గిస్తాడా.. వీహెచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by  |
v hanumantarao news
X

దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెంచిందన్నారు. ఈటల గెలిస్తే ధరలు తగ్గిస్తాడా అని ప్రశ్నించారు.

గతంలో కేంద్రం గ్యాస్ ధరలు పెంచితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రూ.50 తగ్గించిందని గుర్తుచేశారు. హుజురాబాద్‌లో అధికార పార్టీ నాయకులు దర్జాగా ఓటుకు రూ.6 వేలు పంచుతున్నారని, అసలు ఈసీ పని చేస్తుందా అని ఆరోపించారు.



Next Story

Most Viewed