సీఎం జగన్ కు జీవీఎల్ ఘాటు లేఖ

by  |
సీఎం జగన్ కు జీవీఎల్ ఘాటు లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో : సీఎం జగన్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు బుధవారం లేఖ రాశారు. రక్షిత స్మారక కట్టడాలకు హాని కలిగించడం సరికాదని లేఖలో సూచించారు. లేపాక్షి గ్రామంలోని పురాతన స్మారక చిహ్నాలు కూలగొడుతున్నారని, పురావస్తు సైట్లు, అవశేషాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని తప్పబట్టారు.

కాలుష్యంతో స్మారక చిహ్నాలకు తీవ్ర నష్టం జరుగుతోందని, లేపాక్షిలో రహదారి వెడల్పు ప్రణాళికలను మార్చాలన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం ప్రభుత్వ విధి అని లేఖలో నర్సింహారావు ప్రస్తావించారు.


Next Story

Most Viewed