అలెర్ట్ : గురుకులాల డిగ్రీ ప్రవేశ పరీక్ష తేది ఖరారు..

by  |
అలెర్ట్ : గురుకులాల డిగ్రీ ప్రవేశ పరీక్ష తేది ఖరారు..
X

దిశ, నిజామాబాద్ రూరల్ : 2021-22 విద్యాసంవ‌త్సరానికి గాను తెలంగాణ సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో మొద‌టి ఏడాది ప్రవేశానికి జులై 11న ప్రవేశ ప‌రీక్ష జ‌ర‌గ‌నున్నట్లు కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని ఆయా కేంద్రాల్లో ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వహ‌ణ‌ జరుగుతుందన్నారు. అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్స్‌ www.tswreis.in or www.tgtwgurukulam.telangana.gov.in నుండి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి పరీక్ష నిర్ణీత సమయానికి అరగంట ముందే వారి వారి సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.

కాగా, ఆలస్యమైతే పరీక్షా కేంద్రాలకు అనుమతి ఉండదని, కావున ప్రతి ఒక్కరూ కచ్చితంగా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షా సెంటర్లకు వెళ్లాలని డిపార్ట్మెంట్ అఫ్ అల్యూమిని రిలేషన్స్ అండ్ ఔట్రీచ్- కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ దేవిదాస్ సక్పాల్ వివరించారు. మరిన్ని వివరాలకు 99122 27425 మొబైల్ నెంబర్‌ను సంప్రదిచగలరని తెలిపారు.

Next Story

Most Viewed