జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు.. బాపట్ల జవాను మృతి

by  |
జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు.. బాపట్ల జవాను మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూకాశ్మీర్‌లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉగ్రవాదులకు, జవాన్లకు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా వాసి మృతి చెందాడు. నిన్న రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొత్తపాలెంవాసి మరుపోలు జశ్వంత్ రెడ్డి మృతి చెందాడు. ఈయన ఐదేళ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో చేరాడు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతంమయ్యారు.



Next Story