న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పుల కలకలం

by  |
న్యూ ఇయర్ వేడుకల్లో కాల్పుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా వీరాపునాయినిపల్లె మండలం పాయిసంపల్లెలో కాల్పులు కలకలం రేపాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. వేడుకల్లో మహేశ్వరరెడ్డి, సుధాకర్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తలెత్తింది. దీంతో కత్తులు, రాళ్లతో పరస్పరం ఇరు వర్గీయులు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో సుధాకర్ రెడ్డి వర్గీయుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. సుధాకర్ రెడ్డి లైసెన్స్ గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపారు. దాడుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed