దళిత బంధు తీసుకు వస్తావా.. చస్తావా..?

by  |
gujjula
X

దిశ, పెద్దపల్లి : దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి తక్షణమే రూ.500 కోట్లు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సుల్తానాబాద్ మండల బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. మొదటిసారి ఈ సమావేశానికి హాజరైన జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, గుజ్జుల రామకృష్ణారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24 గంటలు పని చేస్తున్నారని, పార్టీ కోసం ప్రతి కార్యకర్తా కనీసం ఒక గంట శ్రమించాలని పిలుపునిచ్చారు. ప్రతీ బూత్‌లో అధ్యక్షులు ప్రధాన మంత్రిని స్ఫూర్తిగా తీసుకుని పని చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో బీజేపీని బలోపేతం చేయాలని కోరారు. కేవలం ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ హుజురాబాద్‌కు అనేక వరాలు కురిపిస్తాడని, పెద్దపల్లి నియోజకవర్గానికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రూ.500 కోట్లు దళిత బంధు తీసుకు వస్తావా.. చస్తావా..? అంటూ ఈ సందర్భంగా సవాల్ విసిరారు.

కార్యక్రమంలో సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు కడారి అశోక్ రావు, పట్టణాధ్యక్షుడు ఎల్లంకి రాజు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు మీస అర్జున్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, నాగరాజు, చంద్రయ్య పాల్గొన్నారు.



Next Story

Most Viewed