మాజీ సీఎం కేశుభాయి పటేల్ కన్నుమూత

by Shamantha N |

<p>దిశ, వెబ్‎డెస్క్ : గుజరాత్‌ మాజీ సీఎం కేశుభాయ్‌ పటేల్‌ (92) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. కేశూభాయి పటేల్ రెండు సార్లు సీఎంగా ఉన్నారు. 1960లో జనసంఘ్‌లో కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1978-1980 మధ్యలో వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. 1995లో మొట్టమొదటి సారిగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 7 [&hellip;]</p>

మాజీ సీఎం కేశుభాయి పటేల్ కన్నుమూత
X

దిశ, వెబ్‎డెస్క్ :
గుజరాత్‌ మాజీ సీఎం కేశుభాయ్‌ పటేల్‌ (92) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. కేశూభాయి పటేల్ రెండు సార్లు సీఎంగా ఉన్నారు.

1960లో జనసంఘ్‌లో కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1978-1980 మధ్యలో వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. 1995లో మొట్టమొదటి సారిగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 7 నెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1998 మార్చి నెలలో మరోసారి సీఎం పదవిని చేపట్టి.. అనారోగ్య కారణాల దృష్ట్యా 2001లో పదవికి రాజీనామా చేశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్యం కారణంగా కేశూభాయి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Next Story