పెళ్లికి గంట ముందు అలా చేసిన వరుడు.. షాకైన వధువు

by  |
పెళ్లికి గంట ముందు అలా చేసిన వరుడు.. షాకైన వధువు
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లి అనేది వధూ వరుల జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. ఈ పండుగను వారు ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకుటారు. ఇక ఓ నెల రోజులు రెండు కుటుంబాల్లో సందడే వేరుంటది. కానీ ఉన్నట్టుండి వివాహం ఆగిపోతే.. అది ఊహించుకోవడానికే ఘోరంగా ఉంది కదా, కానీ ఇదే జరిగింది సంగారెడ్డి జిల్లాలో.

వివరాల్లోకి వెళ్లితే.. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్‌ గ్రామానికి చెందిన యువతిని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌కు చెందిన మాణిక్‌రెడ్డికు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇద్దరి జోడి చూడ ముచ్చటగా ఉండటం అబ్బాయికి కూడా మంచి జాబ్ ఉండటంతో, అమ్మాయి పెళ్లికి ఓకే చెప్పింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని ఈ నెల 12న ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. అనుకున్న టైం కి పెళ్లి జరిపించాలని అమ్మాయి తరఫున వారు చకచకా పెళ్లి పనులు చేసి.. చెప్పిన సమయానికన్న ముందే కళ్యాణ మండపం చేరుకున్నారు. కానీ ముహూర్తం సమయం దగ్గర పడుతున్నా పెళ్లి కొడుకు తరఫున వారు రాకపోవడంతో షాకైన వధువు కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వధువు తరఫునవారు కట్నం కింద ఇచ్చిన రూ.25 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని వరుడు తీసుకొని వివాహానికి గంట ముందే పరారైనట్టు తెలియడంతో వధువు తరఫున వారు షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటూ వరుడు తరఫున కుటుంబ సభ్యులు కూడా ఊరు విడిచి పారిపోయారు.


Next Story

Most Viewed