మనుమడితో కరోనా సోకి అమ్మమ్మ మృతి

by  |
మనుమడితో కరోనా సోకి అమ్మమ్మ మృతి
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: గతవారం కరోనాతో మృతి చెందిన యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అమ్మమ్మ శుక్రవారం మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడకు చెందిన యువకుడు కరోనా బారిన పడి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతిచెందాడు. ఆ తర్వాత మృతుడి కుమారుడు, అమ్మమ్మలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా తాజాగా శుక్రవారం బాధితురాలు (70) మృతి చెందింది. ఈ పరిణామం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపగా… స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది.

Next Story

Most Viewed