అధికారుల నిర్వాకం..గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

by  |
అధికారుల నిర్వాకం..గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అధికారుల చేతివాటం ప్రదర్శించడం, గ్రామస్థుల నుంచి ఎదురైన ఒత్తిడి తట్టుకోలేక ఓ గ్రామ వాలెంటీర్ ఆత్మహత్యాయత్నం చేసింది.ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. బి కొత్తకోట బీసీ కాలనీలో తస్‌పున్సీసా అనే యువతి గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఇళ్ల స్థలాల జాబితాలో అర్హులైన వారికి కేటాయింపులు జరగలేదు. ఇదే విషయాన్ని అధికారులను ప్రశ్నించింది.వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పాటు ఇటు లబ్ధిదారులు గ్రామ వాలంటీర్‌ పై ప్రశ్నల వర్షం కురిపించారు.ఈ నేపథ్యంలోనే బాధితురాలు తహశీల్దారు ఆఫీసు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.

తీవ్ర గాయాల పాలైన ఆమెను స్థానికులు బి కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, తన కూతురు ఆత్మహత్య యత్నానికి అధికారుల నిర్వాకం, లబ్దిదారుల నుంచి వచ్చిన ఒత్తిడే కారణమని కుటుంబీకులు చెబుతున్నారు.

Next Story

Most Viewed