టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారయత్నం

by  |
టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా రోలుగంట మండలం కూసర్లపూడిలో టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారానికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాలిక ట్యూషన్‌ నుంచి వచ్చేసరికి అప్పటికే ఇంట్లో కూర్చున్న వాలంటీర్ నానాజీ విద్యార్థినికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి యత్నించగా పారిపోయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. దీంతో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి కేసు లేకుండా రాజీ ప్రయత్నం చేయగా.. అంగీకరించని బాలిక తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ నానాజీని అరెస్ట్ చేసి.. నిందితుడిపై ఫోక్సో చట్టం, సెక్షన్ 354ఏ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

Next Story

Most Viewed