- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
సొంత నియోజకవర్గం వారణాసి పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. సీఏఏ, ఆర్టికల్ 370పై కీలక వ్యాఖ్యలు చేశారు. విపరీతమైన ఒత్తిడి ఉన్నా.. ప్రభుత్వం సీఏఏ నిర్ణయానికి కట్టుబడే ఉన్నదని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని వ్యతిరకిస్తూ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
కొన్నేండ్లుగా ఆర్టికల్ 370ని నీరుగార్చే, సీఏఏను అమలు చేసే నిర్ణయాల కోసం భారత్ ఎదురుచూస్తోందని అన్నారు. ఈ నిర్ణయాలు దేశహితం కోసం తీసుకున్నవని తెలిపారు. ఒత్తిడి వస్తున్నా.. ఈ నిర్ణయాలకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఒక రోజు పర్యటనలో ఉన్న మోడీ.. దాదాపు రూ. 1,254 కోట్ల విలువైన 50 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీన్దయాల్ ఉపాధ్యాయ్ స్మారక కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. 63 అడుగుల దీన్దయాల్ ఉపాధ్యాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Next Story