‘కుమ్మర్ల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలి’

by Shyam |

<p>దిశ, హైదరాబాద్​ : కుమ్మర్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలని తెలంగాణ కుమ్మర సంఘం అధ్యక్షులు దరిపల్లి చంద్రం డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు గానూ వచ్చే నెల 13న తొలి తెలుగు కవయిత్రి మొల్ల స్ఫూర్తితో ఇందిరా పార్కు వద్ద దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్​ ఆవిష్కరించారు. అనంతరం చంద్రం మాట్లాడుతూ.. కుమ్మర్లను ఎంబీసీలో చేర్చాలనీ, గ్రామదేవతల వద్ద ఆలయ [&hellip;]</p>

‘కుమ్మర్ల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలి’
X

దిశ, హైదరాబాద్​ : కుమ్మర్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించాలని తెలంగాణ కుమ్మర సంఘం అధ్యక్షులు దరిపల్లి చంద్రం డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు గానూ వచ్చే నెల 13న తొలి తెలుగు కవయిత్రి మొల్ల స్ఫూర్తితో ఇందిరా పార్కు వద్ద దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్​ ఆవిష్కరించారు. అనంతరం చంద్రం మాట్లాడుతూ.. కుమ్మర్లను ఎంబీసీలో చేర్చాలనీ, గ్రామదేవతల వద్ద ఆలయ పూజారులుగా నియామించాలని డిమాండ్ చేశారు. వృత్తిదారులకు నెలకు రూ.5000 చొప్పున పెన్షన్​ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోమ్మట వెంకటేశం, చిలువేరు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story