ఐదేళ్లలో 25 విమానాశ్రయాల ప్రైవేటీకరణ!

by  |
airport
X

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ నగదీకరణ ప్రణాళిక(ఎన్ఎంపీ) కింద వచ్చే ఐదేళ్లలో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ అన్నారు. ఎన్ఎంపీ ప్రకారం.. 2022 నుంచి 2025 మధ్య మొత్తం 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నారు.

ఈ జాబితాలో చెన్నై, విజయవాడ, రాజమండ్రి, భువనేశ్వర్, ఇండోర్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, మధురై, సూరత్, రాంచీ, జోద్‌పూర్, కాలికట్, అగర్తల, డెహ్రాడూన్, ఉదయ్‌పూర్ విమానాశ్రయాలున్నాయి. 2018-2020 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏడాదికి 4 లక్షల ప్రయాణీకుల రదీ ఉన్న విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్-19 ప్రభావం వల్ల గతేడాది 136 విమానాశ్రయాల్లొ కేవలం 4 మాత్రమే లాభాలను ఆర్జిస్తున్నాయని శుక్రవారం వీకే సింగ్ వివరించారు.



Next Story

Most Viewed