బ్రేకింగ్.. డెడ్ బాడీల పోస్ట్ మార్టంపై కేంద్రం కీలక ప్రకటన

by  |
బ్రేకింగ్.. డెడ్ బాడీల పోస్ట్ మార్టంపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : అనుమానాస్పదంగా మృతిచెందినా.. యాక్సిండెంటల్ డెత్స్‌కు అయినా తప్పనిసరిగా పోస్ట్ మార్టం చేయాల్సిందే. అయితే, గతంలో కరెంటు సమస్యలు ఉండటంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పోస్ట్ మార్టం జరిపేవారు. ఈ కారణంగా.. ఆసుపత్రిలో ఎక్కువ మృతదేహాలు ఉంటే రెండు, మూడు రోజుల పాటు మృతుల కుటుంబీకులు పోస్ట్ మార్టం కోసం వేచిచూసేవారు.

అయితే, ప్రస్తుతం ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త ప్రొటోకాల్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవ్యా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం.. తగినన్ని మౌలిక సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో ఇక నుంచి రాత్రి వేళల్లో కూడా పోస్ట్ మార్టం నిర్వహించవచ్చని పేర్కొన్నారు.

Next Story

Most Viewed