డాక్టర్ చనిపోతే ఒకరికి ఉద్యోగం :ఏపీ సర్కార్ 

by  |
డాక్టర్ చనిపోతే ఒకరికి ఉద్యోగం :ఏపీ సర్కార్ 
X

దిశ, ఏపీ బ్యూరో : కోవిడ్ వైరస్ బాధితులకు చికిత్స చేస్తూ ప్రభుత్వ వైద్యులు చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం వై ఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా నెల రోజుల్లోగా ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. రేపోమాపో మార్గదర్శకాలతో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఇప్పటికే కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వైద్యులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇకపై ప్రభుత్వ వైద్యుల కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించారు.

Next Story